

అమెరికాకు చెందిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ అడోబ్ కొత్త సీఈఓగా భారతీయుడు అనిల్ చక్రవర్తిని నియమించింది. డిసెంబర్ 1 నుంచి ఆయన ఈ బాధ్యతలను స్వీకరించనున్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా అడోబ్ సీఈఓగా కొనసాగిన శంతను నారాయణ్ పదవి నుంచి వైదొలిగి ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా కొనసాగనున్నారు. ఏఐ ఆధారిత టెక్నాలజీలు వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో ఈ నాయకత్వ మార్పు చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
2020లో అడోబ్లో చేరిన అనిల్ చక్రవర్తి సంస్థలో పలు కీలక విభాగాలకు నాయకత్వం వహించారు. డిజిటల్ ఎక్స్పీరియన్స్ వ్యాపారాన్ని నడిపించడంతో పాటు కస్టమర్ సపోర్ట్ కార్యకలాపాలు, గ్లోబల్ సేల్స్ను పర్యవేక్షించారు. అంతకుముందు క్లౌడ్ డేటా-మేనేజ్మెంట్ సంస్థ ఇన్ఫర్మాటికాలో నాలుగేళ్లపాటు సీఈఓగా పనిచేశారు.
అనిల్ చక్రవర్తి ఐఐటీ వారణాసిలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్లో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మాస్టర్స్, పీహెచ్డీ పట్టాలు పొందారు. ప్రస్తుత ఏఐ యుగంలో అడోబ్ వృద్ధికి నాయకత్వం వహించేందుకు అనిల్ సరైన వ్యక్తి అని శంతను నారాయణ్ పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!