

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి ముంబై అండర్వరల్డ్ నేపథ్యంలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పోలీస్ కంపెనీ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని టీ-సిరీస్ నిర్మిస్తోంది. ఇందులో హర్షవర్ధన్ రాణే ప్రధాన పాత్రలో నటించనున్నారు. 1990ల చివర్లో, 2000ల ప్రారంభంలో ముంబైలో పెరిగిన గ్యాంగ్వార్లను అరికట్టేందుకు అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీస్ స్క్వాడ్ స్ఫూర్తితో ఈ కథను రూపొందిస్తున్నట్లు ఆర్జీవీ తెలిపారు. స్క్వాడ్లో కీలక సభ్యుడైన పోలీస్ అధికారి, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ పాత్రలో హర్షవర్ధన్ రాణే కనిపించనున్నారు.
దావూద్ ఇబ్రహీం, ఛోటా రాజన్ మధ్య విభేదాల తర్వాత ముంబై అండర్వరల్డ్లో ఏర్పడిన ఆధిపత్య పోరును కూడా ఆర్జీవీ వివరించారు. ఈ పరిస్థితుల్లో పలు గ్యాంగ్లు రంగంలోకి రావడంతో ప్రభుత్వం ప్రత్యేక స్క్వాడ్ను ఏర్పాటు చేసిందని, 1997 నుంచి 2004 మధ్య ఆ స్క్వాడ్ 300 మందికి పైగా గ్యాంగ్స్టర్లను హతమార్చిందని ఆయన పేర్కొన్నారు. “డీ-కంపెనీ కంటే ఇది చాలా ప్రమాదకరమైనది” అనే ట్యాగ్లైన్తో ఈ సినిమా రానుంది. మిగతా నటీనటుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!