
సినిమాలు

రిషబ్ శెట్టి ‘కాంతార’ విజయంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తర్వాత, వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘జై హనుమాన్’ సినిమాలో నటిస్తున్నారు. అలాగే హిందీలో సందీప్ సింగ్ దర్శకత్వంలో ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్’ అనే చారిత్రక యాక్షన్ చిత్రంలో నటించనున్నారు.
ఈ చిత్రంతో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ జీవితాన్ని అత్యంత వైభవంగా చూపించేందుకు చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దాదాపు రూ.500 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందించనున్నారు. మొదటి భాగాన్ని 2028లో, రెండో భాగాన్ని 2029లో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇందులో రిషబ్ శెట్టి ప్రధాన పాత్ర పోషించనుండగా, షెఫాలి షా మరియు జనై భోంస్లే కీలక పాత్రల్లో నటించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!