
టెక్నాలజీ

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎం.ఎస్. రాజు సంక్రాంతి సినిమాల విడుదలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, సంక్రాంతి సీజన్ ఎప్పటి నుంచో ప్రతిష్టాత్మకమైనదే అయినప్పటికీ ప్రస్తుతం పోటీ చాలా తీవ్రంగా మారిందని పేర్కొన్నారు. గతంలో థియేటర్ల పంపిణీ సమానంగా ఉండేదని, కానీ ఇప్పుడు ఒకే సినిమాకు ఎక్కువ థియేటర్లు కేటాయించే పరిస్థితి ఉందని తెలిపారు.
తన సినిమా ‘వర్షం’ను చిరంజీవి ‘అంజి’, బాలకృష్ణ ‘లక్ష్మీనరసింహ’ వంటి భారీ సినిమాల మధ్య సంక్రాంతికి విడుదల చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. కంటెంట్పై నమ్మకంతోనే ఆ రిస్క్ తీసుకున్నానని చెప్పారు. అప్పట్లో పాటలకే భారీ రెస్పాన్స్ రావడంతో రిలీజ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అయితే సంక్రాంతి రిలీజ్ చేయడం చాలా కష్టమైందని ఆయన అభిప్రాయపడ్డారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!