
గాసిప్స్

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ప్రీ-రిలీజ్ వేడుకలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నటుడు సూర్య మాట్లాడుతుండగా దర్శకుడు వెంకీ అట్లూరి ఆయనను ఒక్కసారి పైకి చూడాలని కోరారు. అనంతరం సూర్య పాదాలను తాకి నమస్కరించారు. ఊహించని విధంగా చోటుచేసుకున్న ఈ ఘటన వేడుకకు హాజరైన వారిని ఆకట్టుకుంది.
వెంకీ అట్లూరి చేసిన ఈ గౌరవప్రదమైన సంజ్ఞ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సూర్య హీరోగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం ఆగస్టు 14, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!