

రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఇరుముడి బాక్సాఫీస్ వద్ద మంచి జోరును కొనసాగిస్తోంది. విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దీంతో థియేటర్లకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు.
ఇరుముడి తొలి మూడు రోజుల్లోనే రూ.80 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు సమాచారం. ప్రస్తుతం సినిమా ఇదే జోరును కొనసాగిస్తుండటంతో రూ.100 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇస్తుందనే అంచనాలు పెరుగుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన రావడంతో ఈ సినిమా ఓటీటీ విడుదలపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
తాజాగా ఇరుముడి ఓటీటీ పార్ట్నర్కు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం. థియేట్రికల్ రన్ పూర్తైన తర్వాత ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కు వచ్చే అవకాశం ఉంది. అయితే ఓటీటీ స్ట్రీమింగ్ తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
రవితేజ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించగా, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!