
జనరల్

డీలిమిటేషన్ బిల్లుపై సమగ్ర చర్చ నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఆగస్టు 16, 17, 18 తేదీల్లో మూడు రోజుల పాటు ప్రత్యేక సెషన్ నిర్వహించే అవకాశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు రాజకీయ వర్గాలు వెల్లడించాయి.
ఈ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లుతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన సవరణలను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కీలక బిల్లులపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విస్తృత చర్చ జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!