

ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో భారీగా దొంగ ఓట్లు నమోదయ్యాయని ఆరోపించారు. వాటిని గుర్తించి తొలగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన బీజేపీ యువ మోర్చా రాష్ట్ర సమావేశంలో పాల్గొన్న ఆయన, ప్రస్తుతం జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియలో యువ మోర్చా నాయకులు చురుకుగా పాల్గొనాలని సూచించారు. ప్రతి బూత్ పరిధిలో కనీసం 250 కుటుంబాలను కలవాలని పిలుపునిచ్చారు.
దేశ వ్యతిరేక ఆలోచనలు కలిగిన శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మాధవ్ అన్నారు. యువ మోర్చా నాయకులు సామాజిక అంశాలపై స్పందిస్తూ ప్రజల సమస్యలపై గళమెత్తాలని సూచించారు. అలాగే భవిష్యత్ కార్యక్రమాలకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కోరారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తాటి చెట్ల ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించిన ఆయన, ఆంధ్రప్రదేశ్ సముద్ర తీర ప్రాంతాల్లో 10 లక్షల తాటి చెట్లు నాటే లక్ష్యంతో చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!