
జనరల్

తాటి రైతులు, కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక తాటి బోర్డు ఏర్పాటు చేయాలని భాజపా శాసనమండలి పక్షనేత సోము వీర్రాజు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన గురువారం న్యూఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తాటి ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధికి ప్రత్యేక విధానం రూపొందించాలని, రైతులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
తాటిబెల్లం, తాటి కలకండ, నీరా వంటి ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ను అభివృద్ధి చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని సోము వీర్రాజు పేర్కొన్నారు. తాటి రైతులు, కల్లుగీత కార్మికుల అభ్యున్నతి కోసం తాను నిరంతరం కృషి చేస్తానని, వారి సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!