

కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన విమర్శలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పలు ఆధారాలను ప్రదర్శించిన ఆయన, ఇరిగేషన్ శాఖను మూడు నెలల పాటు తనకు అప్పగిస్తే రైతులకు నీరు అందిస్తానని, అది చేయలేకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు. సమ్మక్క బ్యారేజి వద్ద నీరు సమృద్ధిగా ఉన్నప్పటికీ రైతులకు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న విమర్శలను రాజకీయ కుట్రగా అభివర్ణించిన హరీశ్ రావు, మేడిగడ్డపై వచ్చిన నివేదికలు ఎన్నికల ముందు ఉద్దేశపూర్వకంగా తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు 152 మీటర్ల ఎత్తుకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి తెచ్చిందని రుజువు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. కాళేశ్వరం అనేది మూడు బ్యారేజీలు, 21 పంప్ హౌస్లు, 15 రిజర్వాయర్లు, 203 కిలోమీటర్ల టన్నెల్లతో నిర్మించిన భారీ ప్రాజెక్టు అని పేర్కొంటూ, ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!