

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఫార్ములా ఈ-రేస్ కేసులో హైదరాబాద్లోని నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి, స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు కూడా కోర్టుకు హాజరయ్యారు. ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు గతంలో నిందితులకు సమన్లు జారీ చేసింది.
ఫార్ములా ఈ-రేస్ నిర్వహణకు సంబంధించి హెచ్ఎండీఏ నిధుల నుంచి సుమారు రూ.55 కోట్లు చెల్లింపులు జరగడంపై ఏసీబీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అవసరమైన అనుమతులు, ఆర్థిక విధివిధానాలు పాటించకుండా నిధుల బదిలీ జరిగిందని దర్యాప్తు సంస్థ ఆరోపించింది. కేటీఆర్ గత విచారణకు వ్యక్తిగత కారణాలతో గైర్హాజరయ్యారు. అనంతరం విచారణను వాయిదా వేయడంతో తాజా విచారణకు ఆయన హాజరయ్యారు. ఈ కేసులోని ఆరోపణలను నిందితులు ఖండించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!