

నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సోమవారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న కీలక నీటిపారుదల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిరంతర సహకారం అందించాలని ఆయన కోరారు. ఈ ప్రాజెక్టులు పూర్తైతే రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ప్రధానికి వివరించారు.
ఈ సందర్భంగా పల్నాడు జిల్లాలో ఆర్థిక అభివృద్ధిపై రూపొందించిన “పల్నాడు.. ఏ క్రానికల్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్” నివేదికను ప్రధానికి అందించారు. క్రెడిట్ అవుట్రీచ్ కార్యక్రమం ద్వారా 1,03,246 మందికి రూ.3,216 కోట్లు రుణాలు అందించగా, 70 వేల మంది కొత్త రుణగ్రహీతలు బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చారని తెలిపారు. 83,365 మంది రైతులకు రూ.2,286 కోట్లు రుణాలు అందించడంతో పాటు మహిళలు, ఎంఎస్ఎంఈలు, యువత, స్వయం సహాయక బృందాల సాధికారతపై చర్యలను వివరించారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!