
జనరల్

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈడీ అధికారులు ఫోన్ ద్వారా అంబటి రాంబాబును సంప్రదించి, ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. అయితే తనకు ఎలాంటి నోటీసులు అందలేదని అంబటి రాంబాబు అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో విచారణ నిమిత్తం ఈడీ కార్యాలయానికి రావాలని అధికారులు అంబటి రాంబాబుకు స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈడీ నోటీసుల వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే నోటీసులు జారీ చేసిన కేసు లేదా విచారణకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికాలేదు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!