

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మంగళవారం అసెంబ్లీలో కీలక ప్రసంగం చేశారు. నీట్ వివాదం, హిందీ భాషా అంశం, కరూర్ తొక్కిసలాట ఘటన వంటి పలు విషయాలపై స్పందిస్తూ విమర్శకులకు గట్టిగా సమాధానం ఇచ్చారు. తాము అధికారంలోకి రావడం అంత సులభం కాదని, ప్రజల విశ్వాసాన్ని సంపాదించేందుకు ఎన్నో సవాళ్లు, కుట్రలను ఎదుర్కొన్నామని తెలిపారు. తమ పార్టీని ‘యాక్టర్ పార్టీ’గా ఎగతాళి చేసిన వారిని గుర్తుచేసుకుంటూ, ముందుగా ప్రజల్లోకి వెళ్లి వారి మద్దతు సంపాదించిన తర్వాతే పార్టీని స్థాపించి ఎన్నికల్లో విజయం సాధించానని చెప్పారు.
నీట్ పరీక్ష విద్యా వ్యవస్థలో అసమానతలను పెంచుతోందని, దానిని రద్దు చేయాలని మరోసారి డిమాండ్ చేశారు. తమిళనాడు ద్విభాషా విధానానికే కట్టుబడి ఉంటుందని, హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నాలను ఎప్పటికీ అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో జరిగిన కరూర్ తొక్కిసలాటలో 41 మంది మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. ఆ ఘటనకు తమ పార్టీని బాధ్యులను చేయడం బాధాకరమని అన్నారు. అలాగే వారసత్వ రాజకీయాలపై పరోక్షంగా డీఎంకేను విమర్శిస్తూ, తమ ప్రభుత్వం ఒక్క కుటుంబానికే కాకుండా తమిళనాడులోని ప్రతి కుటుంబానికి సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!