
సినిమాలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి నామాలను అపహాస్యం చేయడంపై తీవ్రంగా స్పందించారు. నెల్లూరులో కొన్ని వర్గాలు రాజకీయ అవసరాల కోసం గోవింద నామాలను పేరడీగా ఉపయోగించడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ చర్యలు ధార్మిక విశ్వాసాలకు విఘాతం కలిగిస్తాయని అన్నారు.
ఇలాంటి చర్యలు మతపరమైన విద్వేషాలను రేపే కుట్రపూరిత ప్రయత్నమని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులకు ఆదేశించారు. దైవ నామాలు, మంత్రాలు, స్తోత్రాలు వంటి పవిత్ర అంశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అపహాస్యం చేయకూడదని, వాటిని గౌరవించాలని ప్రజలకు సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!