
జనరల్

అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని తమిళనాడు ప్రభుత్వం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం విజయ్ హాజరై “మాదకద్రవ్యాలను వీడుదాం… పరుగు మొదలుపెడదాం” అనే నినాదంతో మారథాన్ను ప్రారంభించారు. అనంతరం ఆయన పాల్గొన్నవారితో కలిసి సుమారు 6 కిలోమీటర్ల దూరం పరుగు పరిగెత్తారు.
52 ఏళ్ల వయసులో కూడా సీఎం విజయ్ ఉత్సాహంగా పరుగులో పాల్గొనడం అందరినీ ఆకట్టుకుంది. ఆయన ఉత్సాహం, శారీరక దృఢత్వాన్ని అధికారులు ప్రశంసించారు. ఈ కార్యక్రమం యువతలో మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన పెంచడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడమే లక్ష్యంగా నిర్వహించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!