

కారైకుడి మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ సమావేశంలో చోటుచేసుకున్న ఓ ఘటన చర్చనీయాంశంగా మారింది. బుధవారం జరిగిన సమావేశంలో తమ వార్డుల్లో అభివృద్ధి పనులు జరగడం లేదని వివిధ రాజకీయ పార్టీల కౌన్సిలర్లు ఆరోపించారు. అనంతరం సభా మందిరంలో ముఖ్యమంత్రి విజయ్ ఫొటో మాత్రమే ఉండగా, మాజీ ముఖ్యమంత్రులు ఎం.కె. స్టాలిన్, ఎడప్పాడి కె. పళనిస్వామి చిత్రాలు ఎందుకు లేవని డీఎంకే, అన్నాడీఎంకే సభ్యులు ప్రశ్నిస్తూ నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారులు మాజీ ముఖ్యమంత్రులు, దివంగత నేతల చిత్రాలను కూడా ఏర్పాటు చేశారు.
ఈ సమయంలో స్వతంత్ర కౌన్సిలర్ మెయ్యర్ హఠాత్తుగా లేచి నటి త్రిష ఫొటోను కూడా సభా మందిరంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలపై వ్యాఖ్యలు చేస్తూ ఆమె చిత్రాన్ని కూడా ఉంచాలని కోరారు. ఆయన వ్యాఖ్యలతో సమావేశ మందిరంలో ఉన్నవారు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురికావడంతో పాటు నవ్వులు పూశాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!