

దులీప్ ట్రోఫీలో సౌత్ జోన్ ఫైనల్కు దూసుకెళ్లింది. నార్త్ జోన్తో జరిగిన రెండో సెమీఫైనల్లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బుధవారం 256/7 స్కోరుతో ఆటను కొనసాగించిన నార్త్ జోన్ రెండో ఇన్నింగ్స్లో 297 పరుగులకు ఆలౌటైంది. దీంతో సౌత్ జోన్ ముందు 181 పరుగుల లక్ష్యం నిలిచింది. ఈ లక్ష్యాన్ని సౌత్ జోన్ 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు రికీ భుయ్ (42), నారాయణ్ జగదీశన్ (43) శుభారంభం అందించగా.. కెప్టెన్ తిలక్ వర్మ (51*), రవిచంద్రన్ స్మరన్ (32*) మిగతా పనిని పూర్తి చేశారు.
తొలి ఇన్నింగ్స్లో నార్త్ జోన్ 195 పరుగులకే ఆలౌట్ కాగా.. సౌత్ జోన్ 312 పరుగులు చేసింది. కెప్టెన్ తిలక్ వర్మ 250 బంతుల్లో 116 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టుకు కీలక ఆధిక్యాన్ని అందించాడు. రెండు ఇన్నింగ్స్ల్లోనూ అద్భుతంగా రాణించిన తిలక్ వర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. సెప్టెంబర్ 6 నుంచి చెపాక్ స్టేడియంలో దులీప్ ట్రోఫీ ఫైనల్ ప్రారంభం కానుంది. తుదిపోరులో ఇషాన్ కిషన్ సారథ్యంలోని ఈస్ట్ జోన్తో సౌత్ జోన్ తలపడనుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!