

భారత స్టార్ మహిళల డబుల్స్ జోడీ గాయత్రీ గోపీచంద్–ట్రీసా జాలీ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్కు చేరింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో అన్సీడెడ్ భారత జంట నాలుగో సీడ్ చైనా ద్వయం జియా యి ఫాన్–జాంగ్ షు జియాన్ను ఓడించింది.
తొలి గేమ్ను 16–21తో కోల్పోయిన గాయత్రీ–ట్రీసా ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్నారు. రెండో గేమ్ను 21–15తో గెలుచుకున్న భారత జంట.. నిర్ణయాత్మక మూడో గేమ్లో 21–13తో ఆధిపత్యం ప్రదర్శించింది. దీంతో మూడు గేముల్లో విజయం సాధించి కెరీర్లోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది.
రెండు రోజుల క్రితమే ప్రతిష్టాత్మక అర్జున అవార్డులకు ఎంపికైన గాయత్రీ–ట్రీసా.. ఇప్పుడు ప్రపంచ చాంపియన్షిప్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగే సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్లు, టాప్ సీడ్ చైనా జోడీ లియు షెంగ్షూ–టాన్ నింగ్తో భారత జంట తలపడనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!