
సినిమాలు

హైదరాబాద్లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన టీజీ20 సీజన్-1 ఫైనల్లో ఖమ్మం ఏసెస్పై విజయం సాధించిన హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ ఛాంపియన్గా నిలిచింది. ముగింపు వేడుకలకు తెలంగాణ గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరుకాగా, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ఫైనల్ మ్యాచ్ను వీక్షించారు.
అనంతరం గవర్నర్ హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్కు ఛాంపియన్షిప్ ట్రోఫీని, ఖమ్మం ఏసెస్కు రన్నరప్ ట్రోఫీని అందజేశారు. టోర్నమెంట్లో విశేష ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు పతకాలు, వ్యక్తిగత అవార్డులను ప్రదానం చేశారు. తెలంగాణలో క్రికెట్ అభివృద్ధికి, యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ఇటువంటి టోర్నమెంట్లు ఎంతో దోహదపడతాయని గవర్నర్ పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!