
జనరల్

విజయ్ సేతుపతి హీరోగా, దర్శకుడు మిస్కిన్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ట్రైన్’ పలు వాయిదాల తర్వాత విడుదలకు సిద్ధమవుతోంది. గతేడాదే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ను మేకర్స్ విడుదల చేయగా, కదులుతున్న రైలులో జరిగే ఉత్కంఠభరితమైన బంధీల విముక్తి కథను ఆకట్టుకునేలా చూపించారు. యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.
ఈ టీజర్లో శృతి హాసన్ చేతిలో తుపాకీతో కనిపించడం, మరో సన్నివేశంలో విజయ్ సేతుపతిపై గన్ గురిపెట్టడం వల్ల ఆమె ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారా అనే చర్చలు మొదలయ్యాయి. ఈ చిత్రంలో నరైన్, నాజర్, కేఎస్ రవికుమార్, సంపత్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కలైపులి ఎస్. థాను నిర్మించిన ఈ సినిమాకు దర్శకుడు మిస్కిన్ స్వయంగా సంగీతం అందించడం విశేషం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!