

అంతర్జాతీయ క్రికెట్ మండలి విడుదల చేసిన తాజా పురుషుల వార్షిక వన్డే ర్యాంకింగ్స్లో భారత జట్టు అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. గత మూడేళ్ల ప్రదర్శన ఆధారంగా రూపొందించిన ఈ జాబితాలో భారత్ రేటింగ్ పాయింట్లు 119 నుంచి 118కు స్వల్పంగా తగ్గినా, మొదటి స్థానాన్ని కాపాడుకుంది.
న్యూజిలాండ్ జట్టు తన రేటింగ్ను మెరుగుపరుచుకుని 113 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. దీంతో భారత్, న్యూజిలాండ్ మధ్య పాయింట్ల వ్యత్యాసం 8 నుంచి 5 పాయింట్లకు తగ్గింది. ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా జట్టు 109 పాయింట్లతో మూడో స్థానాన్ని యథాతథంగా నిలుపుకుంది.
టాప్ 5లో జరిగిన ఏకైక మార్పులో దక్షిణాఫ్రికా 102 పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకుని పాకిస్థాన్ను వెనక్కి నెట్టింది. వన్డేలతో పాటు పొట్టి ఫార్మాట్ ర్యాంకింగ్స్లోనూ భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. టెస్టుల్లో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉండగా, మహిళల వన్డే మరియు పొట్టి ఫార్మాట్ జాబితాల్లో కూడా ఆస్ట్రేలియానే అగ్రస్థానంలో ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!