
క్రీడలు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు, రజత్ పాటిదార్ సారథ్యంలో ఐపీఎల్ 2026 విజేతగా నిలిచి గుజరాత్ టైటాన్స్పై ఫైనల్లో విజయం సాధించి వరుసగా రెండో టైటిల్ను గెలుచుకుంది. గుజరాత్ రన్నరప్గా నిలవగా, రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫయర్-2లో, సన్రైజర్స్ హైదరాబాద్ ఎలిమినేటర్లో నిష్క్రమించాయి. పంజాబ్ కింగ్స్ జట్టు మాత్రం శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది.
పంజాబ్ పతనంపై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విశ్లేషిస్తూ, మొదటి భాగంలో ఆ జట్టు దూకుడుగా, సానుకూలంగా ఆడి ఏడు మ్యాచ్ల్లో అజేయంగా నిలిచిందని చెప్పారు. అయితే రెండో భాగంలో వరుసగా ఆరు ఓటములతో మొమెంటం కోల్పోయిందని తెలిపారు. ఫలితాలపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల ఆట విధానం దెబ్బతిందని, అదే పంజాబ్ వైఫల్యానికి ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!