
జనరల్

ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు తన ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలో జరిగిన మ్యాచ్లో ఆసక్తికర సంఘటనను పంచుకున్నారు. ఆమె భర్త వెంకట్ దత్తసాయి కాసేపు కోచ్గా మారి మ్యాచ్ సమయంలో మానసిక ధైర్యం ఇచ్చారని తెలిపారు. వృత్తిరీత్యా ఆయన స్పోర్ట్స్ డేటా సైంటిస్ట్ అయినప్పటికీ, ఆ క్షణంలో సింధుకు సహాయం చేశారు.
రెండో రౌండ్లో ఇషారాణి బారువాపై 22-20, 21-12 తేడాతో విజయం సాధించిన సింధు, ఆరోగ్యం బాగోలేకపోయినా భర్త ఇచ్చిన సపోర్ట్ తనకు ఎంతో ఉపయోగపడిందని చెప్పారు. సరదాగా ఆయనను “కోచ్గా ప్రమోట్ చేశాను” అని పేర్కొంటూ, రిఫరీ నుంచి వార్నింగ్లు వచ్చినప్పటికీ ఆ అనుభవం గుర్తుండిపోయేదిగా మారిందని సోషల్ మీడియాలో షేర్ చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!