

కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు చెందిన గుల్వీర్ సింగ్ చరిత్ర సృష్టించాడు. పురుషుల 10,000 మీటర్ల పరుగులో 27:49.78 సెకన్లలో రేసును పూర్తి చేసి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో ఈ విభాగంలో కామన్వెల్త్ క్రీడల చరిత్రలో పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్గా నిలిచాడు. ఆస్ట్రేలియాకు చెందిన కై రాబిన్సన్ 27:48.93 సెకన్లతో స్వర్ణ పతకాన్ని గెలుచుకోగా, ఐల్ ఆఫ్ మ్యాన్కు చెందిన డేవిడ్ ముల్లార్కీ 27:50.28 సెకన్లతో కాంస్య పతకాన్ని అందుకున్నాడు.
పురుషుల హైజంప్లో సర్వేశ్ కుశారే సాధించిన రజతం తర్వాత అథ్లెటిక్స్లో భారత్కు ఇది రెండో రజత పతకం. మరో విశేషం ఏమిటంటే, 1986 కామన్వెల్త్ క్రీడల తర్వాత పురుషుల 10,000 మీటర్ల పోటీలో ఒక్క ఆఫ్రికన్ అథ్లెట్ కూడా పతకం గెలవకపోవడం ఇదే తొలిసారి. ఇదే సమయంలో మహిళల హైజంప్లో భారత్కు నిరాశ ఎదురైంది. పూజా సింగ్ 1.82 మీటర్ల ఎత్తును క్లియర్ చేయడంలో విఫలమవడంతో పతక పోటీ నుంచి నిష్క్రమించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!