
క్రీడలు

భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వైస్ కెప్టెన్గా పనిచేసిన అనుభవం తనకు నాయకత్వ లక్షణాలను పెంపొందించిందని, జట్టును నడిపించే బాధ్యతలకు తాను పూర్తిగా సిద్ధమయ్యానని చెప్పారు.
అవకాశం వస్తే ప్రస్తుతం కెప్టెన్గా ఉన్న హర్మన్ప్రీత్ కౌర్ స్థానంలోనూ జట్టును నడిపించేందుకు సిద్ధంగా ఉన్నానని స్మృతి పేర్కొన్నారు. దేశానికి నాయకత్వం వహించడం గర్వకారణమని, ఆ బాధ్యతను సమర్థంగా నిర్వహించగలననే నమ్మకం తనకు ఉందని వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!