

దేశంలో వరుసగా సినిమాలు సెన్సార్ సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇంటర్నెట్ యుగంలో ప్రపంచంలోని అన్ని రకాల కంటెంట్ అందుబాటులో ఉన్నప్పుడు సినిమాలను సెన్సార్ చేయడం పూర్తిగా కాలం చెల్లిన విధానమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రేక్షకులు ఏ సినిమా చూడాలో నిర్ణయించుకునే హక్కు వారిదేనని, సెన్సార్ బోర్డు సభ్యుల అర్హతలపైనా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు.
18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికి దేశాన్ని పాలించే నాయకులను ఎన్నుకునే హక్కు ఉన్నప్పుడు, సినిమా చూడాలా వద్దా అనేది కూడా ప్రజలే నిర్ణయించుకోవాలని వర్మ అన్నారు. థియేటర్లలో సన్నివేశాలు తొలగించడం ఈ రోజుల్లో హాస్యాస్పదమని పేర్కొంటూ, సృజనాత్మక స్వేచ్ఛను కాపాడేందుకు సెన్సార్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే దర్శకులు, నిర్మాతలు సెన్సార్ అధికారులతో రాజీ పడకూడదని సూచించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!