

ఈ-రిక్షాలను స్మార్ట్ఫోన్ ద్వారా రిమోట్గా నిలిపివేస్తున్న ఘటనలపై కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ ఘటనలకు కారణమవుతున్న మూడు చైనా మొబైల్ యాప్లను గుర్తించిన ప్రభుత్వం, వాటిని యాపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ల నుంచి తొలగించాలని ఆదేశించింది. ఇటీవల ఈ-రిక్షాలను నడిరోడ్డుపై స్మార్ట్ఫోన్తో నిలిపివేస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం బ్యాట్-బీఎంఎస్, లాసిగీ, ఎపోక్ లిథియం-అయాన్ వంటి యాప్లు ఈ-రిక్షాల బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ (బీఎంఎస్)తో అనుసంధానమై పనిచేస్తున్నాయి. వీటిలో తగిన భద్రతా వ్యవస్థలు లేకపోవడంతో బ్లూటూత్ పరిధిలో ఉన్న ఎవరైనా వాహనాన్ని రిమోట్ ద్వారా నిలిపివేసే అవకాశం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ భద్రతా లోపాలపై ఫిర్యాదులు అందడంతో కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, ఆయా యాప్లను డిజిటల్ యాప్ స్టోర్ల నుంచి తొలగించే ప్రక్రియను ప్రారంభించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!