

‘అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్’ బ్యానర్పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన తొలి చిత్రం ‘అమీర్ లోగ్’. రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా, వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రానా దగ్గుబాటి సంస్థ స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని ఆగస్ట్ 21న తెలుగులో గ్రాండ్గా విడుదల చేయనుంది. ప్రమోషన్స్లో భాగంగా దర్శకుడు రమణా రెడ్డి సోమ మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాద్ బస్తీ నేపథ్యంలో ముగ్గురు యువకుల జీవితాల చుట్టూ సాగే కథగా ‘అమీర్ లోగ్’ను రూపొందించినట్లు తెలిపారు. ఆర్కిటెక్చర్ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయనకు కథలు రాయడం, చదవడం పట్ల ఉన్న ఆసక్తి క్రమంగా సినిమాల వైపు నడిపించిందని చెప్పారు.
నటీనటుల సహజమైన నటన, బస్తీ వాతావరణాన్ని తెరపై సహజంగా చూపించేందుకు సింక్ సౌండ్ను ఎంచుకున్నామని దర్శకుడు తెలిపారు. డెమో షూట్తో కలిపి దాదాపు 43 రోజులు షూటింగ్ జరగగా, బస్తీలోనే సుమారు 38 రోజులు చిత్రీకరణ పూర్తయిందన్నారు. స్పిరిట్ మీడియా టీమ్కు సినిమా నచ్చిందని, దర్శకుడు వీఎన్ ఆదిత్య రచనను ప్రత్యేకంగా ప్రశంసించారని తెలిపారు. ‘ఝుండ్’, ‘గల్లీ బాయ్’ వంటి చిత్రాలతో పోల్చిన ప్రశంసలు తనకు ఎంతో ఆనందాన్ని కలిగించాయని చెప్పారు. స్మరణ్ సంగీతం అందించిన ఈ చిత్రంలో 10 పాటలు ఉండగా, కీరవాణి పాడిన పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అన్నారు. సెన్సార్ నుంచి కొన్ని చోట్ల మ్యూట్ సూచనలు మాత్రమే వచ్చాయని, ప్రతి పాత్రకు కథలో ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ‘అమీర్ లోగ్’ ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటుందని దర్శకుడు ధీమా వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!