

ఏఐ రంగంపై పర్యవేక్షణను మరింత కఠినతరం చేస్తూ చైనా ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలు చేయనుంది. జూలై 15 నుంచి అమల్లోకి రానున్న ఈ మార్గదర్శకాల మేరకు అలీబాబా, బైట్డాన్స్, టెన్సెంట్ వంటి ప్రముఖ టెక్ సంస్థలు తమ ఏఐ చాట్బాట్లలో వినియోగదారులు స్వయంగా రూపొందించుకునే వ్యక్తిత్వ (పర్సోనా) ఫీచర్లను తొలగిస్తున్నాయి. 14 ఏళ్లలోపు పిల్లలకు వర్చువల్ కుటుంబ సభ్యులు లేదా ప్రేమ భాగస్వాముల వంటి సేవలను అందించడం నిషేధించగా, సేవలు అందించాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేసింది.
వినియోగదారుల వ్యక్తిగత సమాచారం భద్రత, అసభ్యకర కంటెంట్, అలాగే ఏఐ కంపానియన్ సేవల వల్ల కలిగే మానసిక ప్రభావాలపై ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 3,500కుపైగా నిబంధనలకు విరుద్ధమైన ఏఐ యాప్లు, మినీ ప్రోగ్రామ్లు, ఏజెంట్లను చైనా తొలగించింది. ఇకపై తప్పుడు సమాచారం, అసభ్యకర ఏఐ కంటెంట్పై కూడా మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!