
రాజకీయాలు

₹2,000 కంటే ఎక్కువ విలువైన కొన్ని యూపీఐ వ్యాపార లావాదేవీలపై భవిష్యత్తులో మెర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీలు విధించే అవకాశానికి కేంద్ర ప్రభుత్వం మార్గం సుగమం చేసే బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. అయితే ప్రస్తుతం ఎలాంటి ఛార్జీలు అమల్లోకి రావడం లేదు. భవిష్యత్తులో ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా నిర్ణయం తీసుకునేందుకు ఈ బిల్లు చట్టపరమైన వెసులుబాటు కల్పిస్తుంది.
ఈ ప్రతిపాదన కేవలం వ్యాపారులకు చేసే యూపీఐ చెల్లింపులకు మాత్రమే వర్తించనుంది. వ్యక్తి నుంచి వ్యక్తికి (P2P) జరిగే యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించే ప్రతిపాదన లేదు. ఛార్జీల శాతం, ఏ లావాదేవీలకు వర్తించాలనే అంశాలను కేంద్రం తర్వాత నిర్ణయించనుంది. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను ఆర్థికంగా స్థిరంగా కొనసాగించడమే ఈ మార్పుల లక్ష్యమని సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!