
జనరల్

పశ్చిమాసియా ఉద్రిక్తతలు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ద్రవ్యోల్బణ భయాలు పెరుగుతున్నాయని ఐసీఐసీఐ బ్యాంక్ గ్లోబల్ మార్కెట్స్ నివేదిక తెలిపింది. ఆహారం, ఇంధన ధరలు ఇప్పటికే పెరిగాయని, ఎల్నినో ప్రభావం మరియు వర్షాభావం కారణంగా పరిస్థితి మరింత తీవ్రం కావచ్చని హెచ్చరించింది.
వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉంటే 2026–27 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 5 శాతానికి చేరే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ధరల నియంత్రణ కోసం ఆర్బీఐ వడ్డీ రేట్లు 50–75 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రస్తుతం రెపో రేటు 5.25 శాతంగా ఉంది. ఇప్పటికే ద్రవ్యోల్బణం 16 నెలల గరిష్ఠానికి చేరినట్లు తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!