

ఈరోజు భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఐటీ షేర్లలో బలమైన కొనుగోళ్లు కొనసాగడంతో నిఫ్టీ ఐటీ సూచీ దాదాపు 2.5 శాతం ఎగసింది. నిన్న విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) రూ.755 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయడం మార్కెట్కు ఊతమిచ్చింది. అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచే అవకాశాలపై వచ్చిన వార్తలు, డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.76 వద్ద బలపడటం కూడా మార్కెట్ సెంటిమెంట్ను మెరుగుపరిచాయి.
గత ముగింపు 76,765 పాయింట్లతో పోలిస్తే సెన్సెక్స్ దాదాపు 600 పాయింట్ల లాభంతో ప్రారంభమై, ఉదయం 9:40 గంటలకు 761 పాయింట్లు పెరిగి 77,527 వద్ద ట్రేడైంది. నిఫ్టీ కూడా 219 పాయింట్లు లాభపడి 24,204 వద్ద కొనసాగింది. కేపీఐటీ టెక్నాలజీస్, స్విగ్గీ, కోఫోర్జ్, సెయిల్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో నిలవగా, ఫీనిక్స్ మిల్స్, మదర్సన్, కేఫిన్ టెక్నాలజీస్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, సీజీ పవర్ షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ మిడ్క్యాప్ సూచీలు కూడా లాభాల్లో కొనసాగాయి.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!