
క్రీడలు

కొన్ని రోజులుగా వరుసగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు మళ్లీ ఒక్కసారిగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు సుమారు 4,090 డాలర్లకు చేరుకోగా, వెండి ధర 59 డాలర్ల స్థాయికి పెరిగింది. గ్లోబల్ మార్కెట్ ధోరణికి అనుగుణంగా దేశీయ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు పెరుగుదల నమోదు చేశాయి.
హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,100 పెరిగి రూ.1,31,950కు చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,200 పెరిగి రూ.1,43,950గా నమోదైంది. వెండి ధర కిలోకు రూ.2.45 లక్షల వద్ద కొనసాగుతోంది. గత మూడు రోజుల్లో రూ.6 వేలకుపైగా తగ్గిన బంగారం ధరలు, గత రెండు రోజుల్లో మళ్లీ గణనీయంగా పుంజుకోవడం మార్కెట్లో చర్చనీయాంశమైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!