

పూణేలో సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసు మరోసారి చర్చనీయాంశమైంది. కేతన్ అగర్వాల్ను నిందితురాలు సియా గోయల్తో కలిసి చూపిస్తూ రూపొందించిన ఏఐ వీడియోలు, ఫోటోలు, రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కంటెంట్ పూర్తిగా కల్పితమైనదైనా, లక్షలాది మంది వీటిని వీక్షిస్తూ, పంచుకోవడంతో కేతన్ కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. దయచేసి ఇలాంటి వీడియోలను తయారు చేయడం, షేర్ చేయడం ఆపాలని వారు భావోద్వేగంగా విజ్ఞప్తి చేశారు.
పోలీసుల దర్యాప్తు ప్రకారం, జూన్ 18న లోహగడ్ కోట సమీపంలో కేతన్ అగర్వాల్ను ప్రణాళికాబద్ధంగా హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో సియా గోయల్, చేతన్ చౌదరిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే తమ కుమారుడిని కోల్పోయిన బాధ నుంచి బయటపడలేకపోతున్నామని, ఇప్పుడు ఏఐ వీడియోలు ఆ బాధను మరింత పెంచుతున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనతో ఏఐ సాంకేతికత దుర్వినియోగం, ఫేక్ కంటెంట్ నియంత్రణపై మరోసారి చర్చ ప్రారంభమైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!