

అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రభావంతో దేశీయంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ తగ్గడం, బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావించే మదుపరులు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో పసిడి ధరలు ఏడు వారాల గరిష్ఠ స్థాయికి చేరాయి. పశ్చిమాసియాలో అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ బంగారం ధరల పెరుగుదల మార్కెట్ వర్గాల దృష్టిని ఆకర్షించింది.
10 గ్రాముల బంగారం ధర రూ.536 పెరిగి రూ.1,49,029కు చేరగా, ట్రేడింగ్ సమయంలో గరిష్ఠంగా రూ.1,49,700ను తాకింది. మరోవైపు వెండి ధరల్లో మిశ్రమ ధోరణి కనిపించింది. సెప్టెంబర్ 4 ఫ్యూచర్స్లో కిలో వెండి ధర రూ.813 పెరిగి రూ.2,28,397కు చేరినప్పటికీ అనంతరం కొంత లాభాలను కోల్పోయింది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్లో ఔన్సు బంగారం 4,320 డాలర్ల వద్ద, వెండి 62.36 డాలర్ల వద్ద ట్రేడైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!