

బ్యాంకు ఉద్యోగుల పలు డిమాండ్ల పరిష్కారం కోసం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు అడ్వైజరీ జారీ చేసింది. సమ్మె కారణంగా బ్రాంచ్ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున ముందస్తుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. అత్యవసర నగదు అవసరాల కోసం ఏటీఎంలు, డిపాజిట్ వెండింగ్ మెషిన్లు, కస్టమర్ సర్వీస్ పాయింట్లను వినియోగించుకోవాలని తెలిపింది.
ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ వంటి డిజిటల్ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయని ఎస్బీఐ పేర్కొంది. ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం అమలు సహా పలు డిమాండ్లపై UFBU ఇప్పటికే సెప్టెంబర్ 11న దేశవ్యాప్త సమ్మె చేపట్టింది. సెప్టెంబర్ 28–30 సమ్మె అనంతరం కూడా డిమాండ్లపై పరిష్కారం లేకపోతే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని యూనియన్లు ప్రకటించాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!