

హెచ్డీఎఫ్సీ బ్యాంక్, దాని సీఈఓ శశిధర్ జగదీశన్, సీఎఫ్ఓ శ్రీనివాసన్ వైద్యనాథన్పై అమెరికాలోని న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్ కోర్టులో సెక్యూరిటీస్ క్లాస్ యాక్షన్ దావా నమోదైంది. 2023 జూలై 17 నుంచి 2026 మే 26 మధ్య హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అమెరికన్ డిపాజిటరీ షేర్లను కొనుగోలు చేసిన పెట్టుబడిదారుల తరఫున ఈ కేసు దాఖలైంది. మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఎస్ఆర్డీసీ) నుంచి భారీ డిపాజిట్లు పొందేందుకు 6.01 శాతం వడ్డీని ఆఫర్ చేసి, దానికి సంబంధించిన సుమారు రూ.45 కోట్ల చెల్లింపులను మార్కెటింగ్ ఖర్చులుగా చూపించారనే ఆరోపణలు దావాలో ఉన్నాయి.
ఈ ఆరోపణలపై హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్పందిస్తూ, అమెరికాలో షేర్ ధర తగ్గిన తర్వాత ఇలాంటి వాటాదారుల దావాలు సాధారణమేనని పేర్కొంది. ప్రస్తుత దావాలో మెరిట్ లేదని, న్యాయపరంగా గట్టిగా పోరాడతామని స్పష్టం చేసింది. ఇదే సమయంలో గిఫ్ట్ సిటీ శాఖ ద్వారా 1.75 బిలియన్ డాలర్ల డాలర్ బాండ్ జారీని బ్యాంక్ విజయవంతంగా పూర్తి చేసింది. తాజా పరిణామాలతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లపై ఒత్తిడి పెరిగింది. అయితే కేసులోని ఆరోపణలు ఇంకా న్యాయస్థానం తేల్చిన వాస్తవాలు కావని గుర్తుంచుకోవాలి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!