
జనరల్

సెబీ (SEBI) స్టాక్ మార్కెట్ ట్రేడింగ్కు సంబంధించి కొత్త నిబంధనలను నేటి నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. తాజా మార్పుల ప్రకారం, F&O స్టాక్స్లో రెగ్యులర్ ట్రేడింగ్ మధ్యాహ్నం 3:15 గంటలకు ముగియనుండగా, అనంతరం 3:15 నుంచి 3:35 గంటల వరకు ప్రత్యేక క్లోజింగ్ అక్షన్ సెషన్ (CAS) నిర్వహించనున్నారు. ఈ సెషన్లో నిర్ణయించిన ధరనే అధికారిక ముగింపు ధరగా పరిగణిస్తారు.
అదనంగా, F&O ట్రేడింగ్ సమయాన్ని 10 నిమిషాలు పొడిగించి సాయంత్రం 3:40 గంటల వరకు కొనసాగించనున్నారు. అయితే నాన్-F&O ఈక్విటీ క్యాష్ స్టాక్స్ ట్రేడింగ్ సమయం యథావిధిగా మధ్యాహ్నం 3:30 గంటలకే ముగుస్తుంది. మార్కెట్లో పారదర్శకతను పెంచడంతో పాటు క్లోజింగ్ ధరల నిర్ణయంలో మెరుగైన ప్రైస్ డిస్కవరీ కోసం ఈ మార్పులు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!