

ప్రముఖ స్పోర్ట్స్వేర్ సంస్థ అడిడాస్ భారత్లోని తన టెక్నాలజీ విభాగంలో ఉద్యోగాల కోతకు శ్రీకారం చుట్టింది. గురుగ్రామ్లోని ఇండియా టెక్ హబ్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, డేటా సైంటిస్టులు, డేటా ఇంజినీర్లు సహా పలు సాంకేతిక విభాగాల ఉద్యోగులపై ఈ ప్రభావం పడినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. మారుతున్న వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఆపరేటింగ్ మోడల్లో మార్పులు చేస్తూ సంస్థ కార్యకలాపాలను సరళీకరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అడిడాస్ తెలిపింది. ప్రభావిత ఉద్యోగులకు మార్పు సమయంలో సహాయం అందిస్తామని పేర్కొంది.
జాతీయ మీడియా నివేదికల ప్రకారం, గురుగ్రామ్ టెక్ హబ్లోని సుమారు 700 మంది ఉద్యోగుల్లో దాదాపు 350 మందిపై లేఆఫ్స్ ప్రభావం ఉండొచ్చని తెలుస్తోంది. అయితే ఈ సంఖ్యను అడిడాస్ అధికారికంగా ధృవీకరించలేదు. సెప్టెంబర్ 15న ఉద్యోగులకు లేఆఫ్స్పై సమాచారం ఇచ్చినట్లు, కొందరికి అదే రోజు ఎగ్జిట్ లెటర్లు అందినట్లు నివేదికలు తెలిపాయి. మరో వర్గం ఉద్యోగులు డిసెంబర్ 15 వరకు కొనసాగుతూ బాధ్యతలను ఇతర టెక్ హబ్ల సిబ్బందికి అప్పగించాల్సి ఉంటుంది. అంతర్గతంగా ఇతర ఉద్యోగాలకు మారే అవకాశం కూడా కల్పించినట్లు సమాచారం. సెవరెన్స్ ప్యాకేజీ, నోటీస్ పే వివరాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!