

ఎలాన్ మస్క్కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా, ఉద్యోగులు వినియోగించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్పై కొత్త ఆంక్షలు విధించింది. ఉద్యోగి ఒక్కొక్కరు వారానికి 200 డాలర్లు (సుమారు రూ.19 వేల) వరకు మాత్రమే ఏఐ టూల్స్ వినియోగానికి ఖర్చు చేయాలని సంస్థ అంతర్గత మెమోలో పేర్కొంది. ఈ నిబంధనలు జులై 6 నుంచి అమల్లోకి రానున్నాయి. ఏఐ టోకెన్ల వినియోగం భారీగా పెరగడంతో నిర్వహణ వ్యయాలు అధికమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు టెస్లా ఉద్యోగులను ఏఐ టూల్స్ వినియోగానికి ప్రోత్సహించింది. ఓపెన్ఏఐ, ఆంథ్రోపిక్, ఎక్స్ఏఐ, కర్సర్ వంటి సేవలను ఒకే వేదికపై అందించేందుకు బాటిల్ రాకెట్ అనే ప్లాట్ఫామ్ను కూడా రూపొందించింది. ఉద్యోగుల ఏఐ టోకెన్ల వినియోగాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక డ్యాష్బోర్డ్ను ఏర్పాటు చేసింది. మంచి ఫలితాలు వచ్చినప్పటికీ పెరుగుతున్న ఖర్చుల కారణంగా ఈ పరిమితులు అమలు చేసింది. ఇప్పటికే ఉబర్, వాల్మార్ట్, అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు కూడా ఇలాంటి వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!