

అంతర్జాతీయ పేమెంట్ గేట్వే సంస్థ వీసా భారత మార్కెట్లో ‘పేమెంట్ పాస్కీ’ సేవలను ప్రారంభించింది. ఆన్లైన్ కార్డు చెల్లింపుల్లో ఓటీపీకి ప్రత్యామ్నాయంగా ఈ సరికొత్త ధ్రువీకరణ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ భాగస్వామ్యంతో ప్రస్తుతం ఎంపిక చేసిన వినియోగదారులకు ఈ సేవలను అందిస్తోంది.
FIDO (ఫాస్ట్ ఐడెంటిటీ ఆన్లైన్) ప్రమాణాలతో రూపొందించిన ఈ పాస్కీ ద్వారా వినియోగదారులు ఫింగర్ప్రింట్, ఫేస్ రికగ్నిషన్, పిన్, పాస్వర్డ్ లేదా ప్యాటర్న్ సహాయంతోనే చెల్లింపులను ధ్రువీకరించవచ్చు. దీంతో ఓటీపీ అవసరం లేకుండానే మరింత భద్రంగా, వేగంగా లావాదేవీలు పూర్తి చేయవచ్చు.
మింత్రా, పేటీఎం, మేక్మైట్రిప్, టాటా స్టార్బక్స్, రిలయన్స్ డిజిటల్, ఈట్ష్యూర్ వంటి ప్లాట్ఫామ్లతో పాటు జస్పే, రేజర్పే, పేయూ, పైన్ ల్యాబ్స్, బిల్డెస్క్, విబ్మో, ఎం2పీ వంటి ఫిన్టెక్ సంస్థల ద్వారా కూడా ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేయడమే దీని ప్రధాన లక్ష్యమని వీసా తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!