

ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR)లో అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ పూర్తైంది. దీంతో ఓటర్ల జాబితా సవరణ కీలక దశకు చేరుకుంది. చిరునామా వివరాలు, ఇతర అవసరమైన ఆధార పత్రాలు లేని 44 లక్షలకు పైగా ఓటర్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. మరోవైపు సుమారు 24 లక్షల మంది ఓటర్లకు సంబంధించిన ఆధార పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఓటర్ల వివరాల ధ్రువీకరణలో భాగంగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది.
SIR ప్రక్రియలో ఇప్పటివరకు సుమారు 15 వేల మంది ఓటర్లు అనర్హులుగా గుర్తించినట్లు సమాచారం. అభ్యంతరాల పరిశీలన, పరిష్కార ప్రక్రియను సెప్టెంబర్ 28 నాటికి పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. అనంతరం తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 3న విడుదల చేయనున్నారు. అర్హులైన ఓటర్ల పేర్లు, వివరాలు సక్రమంగా ఉండేలా చూడటంతో పాటు అనర్హులైన వివరాలను తొలగించడమే ఈ సవరణ ప్రక్రియ ప్రధాన ఉద్దేశంగా అధికారులు పేర్కొంటున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!