
రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్) నేటి నుంచి ప్రారంభమైంది. ఈ నెల 16 వరకు జరగనున్న ఈ పరీక్షలు రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి కనీసం గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా 103 పరీక్షా కేంద్రాల్లో టెట్ నిర్వహిస్తుండగా, మొత్తం 2.14 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. వీరిలో 74,711 మంది ఇన్సర్వీస్ టీచర్లు ఉన్నారు. హాల్టికెట్పై ఫొటో లేకపోతే ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని అధికారులు స్పష్టం చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!