

తమిళనాడులోని సేలం జిల్లా పుదుకొత్తంబాడి గ్రామంలో విచిత్రమైన మోసం వెలుగులోకి వచ్చింది. తహసీల్దార్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామని చెప్పిన ఓ దుండగుడు, కరోనా తరహాలో కొత్త వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని మహిళలను భయపెట్టాడు. విదేశాల్లో ఈ వ్యాధి బారిన పడిన వారంతా గుండు చేయించుకున్నారని, తమిళనాడు ప్రభుత్వం కూడా అదే విధానాన్ని అమలు చేస్తోందని తప్పుడు ప్రచారం చేశాడు.
గుండు చేయించుకుంటే మహిళలకు ₹15 వేల నగదు, కళాశాల విద్యార్థినులకు ₹45 వేలతో పాటు ఉచిత ల్యాప్టాప్, పురుషులకు ₹6 వేల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి ఓ మహిళను నమ్మించాడు. ఆమె ఈ విషయాన్ని గ్రామంలోని ఇతర మహిళలకు చెప్పడంతో ముగ్గురు మహిళలు గుండు చేయించుకున్నారు. అనంతరం దుండగుడికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో తాము మోసపోయామని గ్రహించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమైంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!