

దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశా శాలియన్ మృతి కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ ఎఫ్ఐఆర్లో శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే, నటులు రియా చక్రవర్తి, డినో మోరియా, సూరజ్ పంచోలి తదితరుల పేర్లు ప్రస్తావిస్తూ.. వారి పాత్రను దర్యాప్తు చేయాల్సి ఉందని పేర్కొంది. క్రిమినల్ కుట్ర, హత్య, సామూహిక అత్యాచారం, సాక్ష్యాలను అణచివేయడం లేదా ధ్వంసం చేయడం వంటి ఆరోపణలపై దర్యాప్తు జరగనుంది. అయితే ఎఫ్ఐఆర్లో పేర్లు ఉన్న వారిని ప్రస్తుతానికి నిందితులుగా పరిగణించడం లేదని సీబీఐ స్పష్టం చేసింది.
దిశా శాలియన్ 2020 జూన్ 8న ముంబయిలోని మలాడ్ ప్రాంతంలోని ఓ నివాస భవనం నుంచి కిందపడటంతో మృతి చెందారు. అప్పట్లో ముంబయి పోలీసులు ఆమెది ఆత్మహత్యగా పేర్కొన్నారు. అయితే దిశా తండ్రి సతీశ్ శాలియన్ ఆమె మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దర్యాప్తులో పలు లోపాలు ఉన్నాయని ఆయన ఆరోపించడంతో బాంబే హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది. దర్యాప్తులో తగిన ఆధారాలు లభించే వరకు ఎవరినీ నిందితులుగా పరిగణించరాదని కోర్టు స్పష్టం చేసింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!