
జనరల్

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, ఆదివారం నుంచి వెంటిలేటర్పై ఉండగా గురువారం తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. ఆయన మరణవార్తతో కుటుంబ సభ్యులు, అనుచరులు, రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయన మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు.
శుక్రవారం ఉదయం ఆయన భౌతిక కాయాన్ని హైదరాబాద్ నుంచి వరంగల్ జిల్లా నర్సంపేటకు తరలించనున్నారు. అనంతరం స్వగ్రామమైన నల్లబెల్లిలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రజాసేవలో ఆయన చేసిన సేవలను పలువురు రాజకీయ నాయకులు, అభిమానులు స్మరించుకుంటూ నివాళులర్పిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!