
జనరల్

ఏపీ పౌరసరఫరాల శాఖ 12 మంది సీనియర్ అధికారులతో ప్రత్యేక విజిలెన్స్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు, సీఎంఆర్ డెలివరీలు తదితర అంశాలపై ప్రత్యేకంగా నిఘా పెట్టనుంది. సరఫరా వ్యవస్థలో పారదర్శకతను పెంచడం లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నారు.
రేషన్ షాపులు, పీడీఎస్ స్టాక్ పాయింట్లు, ఎల్పీజీ ఏజెన్సీలు, పెట్రోల్ బంకులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించనుంది. అలాగే దీపం-2 పథకం, అంగన్వాడీలు, హాస్టళ్లు, మధ్యాహ్న భోజన పథకం అమలును కూడా పర్యవేక్షించనుంది. ఉల్లంఘనలపై నివేదికలను ప్రభుత్వానికి అందించనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!