
క్రీడలు

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పే చేనేత కళను పరిరక్షించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, అందులో భాగంగానే ‘నేతన్న సేవలో’ పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.
ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 71,536 చేనేత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.25 వేల చొప్పున మొత్తం రూ.179 కోట్ల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. విద్యుత్ రాయితీలు, 50 ఏళ్లకే పింఛన్ వంటి పథకాల ద్వారా నేతన్నలకు అండగా నిలుస్తున్నామని చెప్పారు. చేనేత వృత్తి వారసత్వాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కలిసి ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!