

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కలిసి పీఎంఏవై-జీ (PMAY-G) 2.0 కింద తెలంగాణకు 11.56 లక్షల గ్రామీణ ఇళ్లను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామీణ గృహ నిర్మాణం నిర్లక్ష్యానికి గురైందని కేంద్ర మంత్రికి వివరించిన సీఎం, అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణానికి కేంద్రం సహకరించాలని కోరారు.
ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా వీబీ-జీ రామ్-జీ (WB-GRAM) పథకంలో అదనపు పనులను చేర్చాలని కూడా సీఎం విజ్ఞప్తి చేశారు. రైతుల జీవనోపాధి మెరుగుదలకు కూరగాయల పందిళ్లు, పశుగ్రాస ప్లాట్లు, మల్బరీ తోటలు, పట్టు పురుగుల పెంపక షెడ్లు వంటి 10 కొత్త పనులను చేర్చాలని కోరారు. అలాగే భూముల అభివృద్ధి, నీటి సంరక్షణ, ప్రకృతి వైపరీత్యాలతో దెబ్బతిన్న భూముల పునరుద్ధరణ పనులకు అవకాశం కల్పించాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ఈ పథకంలో చేర్చి లబ్ధిదారులకు 90 రోజుల ఉపాధి కల్పించాలని కేంద్ర మంత్రిని కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!